అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది.
అనంతపురము జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి యాడికి లోని కొనుప్పలపాడు గ్రామ సర్వే నెంబరు 22బి లో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదన్న కారణంతో గనుల లీజు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నది.
లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి రవాణా చేయటంపైనా విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇటీవల కాలంలో జెసికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్ టి ఒ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.