కశ్మీర్ ర్యాలీతో బూటకపు ప్రచారం
‘‘పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ లో బీజేపీ జెండా రెపరెపలు.. మోదీయే దాన్ని సుసాధ్యం చేశారు’’. బురఖాలు కట్టుకుని ఉన్న కొందరు మహిళలు, ఇతర ముస్లింలతో కూడిన కొంతమంది బీజేపీ జెండాలు ఎగరేస్తూ ఆ పార్టీకి మద్దతుగా నినాదాలు ఇస్తున్న వీడియో పై సందేశంతో సోషల్ మీడియాలో షేర్ అయింది. నమో ఎగైన్ అనే ఈ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోను 3,700 సార్లు షేర్ చేశారు. పాకిస్థాన్ లోనే అత్యంత పెద్ద రాష్ట్రమైన బెలుచిస్థాన్ ప్రజలు బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపినట్లు అందులో చెప్పారు.
https://www.facebook.com/addyourfriendstolikepage/videos/1170327026483182/
జై భీమ్ ట్రోల్ సొసైటీ ఏక్తా మార్చ్ అనే పేరుతో ఉన్న మరో ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ వీడియోను 3,400 సార్లు షేర్ చేశారు. పలువురు వ్యక్తులు సైతం ఈ వీడియోను ఇదే వర్ణనతో షేర్ చేసుకున్నారు.
ఏది నిజం?
బెలూచిస్థాన్ ప్రాంతంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారంటున్న ఈ వీడియో నిజానికి జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ స్థానంలో బీజేపి అభ్యర్థి ప్రచార ర్యాలీ. ఇది అనంతనాగ్ లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సోఫీ యూసుఫ్ అనే అభ్యర్థి ర్యాలీ అని మాధవ్ సింగ్ రాజ్ పుత్ అనే ఫేస్ బుక్ యూజర్ నమో ఎగైన్ పోస్టు మీద కామెంట్ చేశారు.
అంతేకాదు.. సోఫీ యూసుఫ్ కూడా ఇదే ఊరేగింపు వీడియోను 2019 మార్చి 30వ తేదీన ట్వీట్ చేశారు. న్యూస్24 ఇండియా కూడా అదే వీడియోను ట్వీట్ చేసింది గానీ అందులో మాటలు వినిపించడం లేదు.
While going to file nomination papers.#PhirEkBaarModiSarkar #LokSabhaElection2019 #NamoNamo @narendramodi @AmitShah @rammadhavbjp @Ramlal @ImAvinashKhanna @AshokKoul59 @RavinderBJPJK @BJP4JnK @BJP4India pic.twitter.com/l1cUMiUzIZ
— Sofi Yousuf?? (@imSofiYousuf) March 30, 2019
బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఊరేగింపు వీడియోను బెలూచిస్థాన్ ప్రజలు బహిరంగంగా బీజేపీకి మద్దతిస్తున్నట్లుగా చూపించి సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించారు. మైనేతా డేటాబేస్ ప్రకారం, సోఫీ యూసుఫ్ అనంతనాగ్ స్థానంలో బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు.
(ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో)