అమరావతి: రెవెన్యూ అధికారుల పనితీరుపై నిత్యం ఎక్కడో ఒక చోట రైతులు ఆందోళన, నిరసనలు చేయడం కనబడుతోంది. తాజాగా కృష్ణాజిల్లా నందిగామ తహశీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగుల వైఖరిపై గురువారం ఒక రైతు నాగలితో వినూత్న నిరసన చేపట్టాడు. తన తల్లికి సంబందించిన భూమి సర్వే చేయకుండానే సర్వే చేసినట్లు సర్వేయర్ తప్పుడు దృవీకరణ ఇచ్చారని దుర్గాప్రసాద్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. అక్రమణదారులకు రెవెన్యూ అధికారులు అండగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం ముందు నిరసన చేపడతానని హెచ్చరించాడు.
ముసునూరు తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఒక వ్యక్తి తమ దృవీకరణ పత్రం జారీకి తిప్పుకొంటున్నారని సిబ్బందిని నిలదీయగా కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ ఆ వ్యక్తిపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై ఇరువురు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.