న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ గతిని మార్చే బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టొచ్చనే అందరూ భావిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుంచి కంపెనీల వరకు అందరూ ఇప్పుడు బడ్జెట్వైపే చూస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు బడ్జెట్లో వరాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఉద్యోగులు పన్ను తగ్గింపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే కంపెనీలు కూడా ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇప్పటికే భారత దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. జీడీపీ రేటు 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఉద్యోగాలు పోతున్నాయి. కంపెనీలు ఉత్పత్తి తగ్గించేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. మందగమనం నుంచీ దేశాన్ని బయటపడేసేలా కేంద్ర బడ్జెట్ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నాయి. వాటివల్లే వివిధ రంగాలు దెబ్బతిన్నాయన్న విమర్శలున్నాయి. దానికి తోడు దేశంలో నిరుద్యోగం ఏమాత్రం తగ్గలేదు. నిత్యవసర ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అలాగే అధిక పన్ను శ్లాబ్లో ఉన్న వారు 5 శాతం పన్ను తగ్గింపు ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం రెండు పథకాలు ప్రవేశపెట్టొచ్చనే అంచనాలున్నాయి.
#WATCH Delhi: Finance Minister Nirmala Sitharaman and MoS Finance Anurag Thakur arrive at the Parliament, to attend Cabinet meeting; Presentation of Union Budget 2020-21 at 11 am pic.twitter.com/J217IqrVUr
— ANI (@ANI) February 1, 2020