ఉత్తరప్రదేశ్: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించారు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్. కుట్రలో భాగంగానే తనపై ఈ ఆరోపణలు చేశారన్నారు. నలుగురు యువకులు డబ్బులు కోసం తనను బెదిరించారని తెలిపారు. గతంలో కుల్దీప్ సింగ్ సిగార్ ను కూడా ఇదే తరహా కేసులో ఇరికించారని, ఇప్పుడు తనను టార్గెట్ చేశారని చిన్మయానంద్ చెప్పారు. ఇది ఇలా ఉంటే.. స్వామి చిన్మయానంద్ పై 23ఏళ్ల ఓ న్యాయ విద్యార్థిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అనంతరం ఆ యువతి అదృశ్యమైంది. దీంతో చిన్మయానంద్ పై ఉత్తరప్రదేశ్ లోని షాజహన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాలేజీ హాస్టల్ నుంచి తమ కుమార్తె అదృశ్యమైందనీ, చిన్మయానందే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు షాజహన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కు గురైన యువతి లా చదువుతున్న ఎస్ఎస్ పోస్ట్ గ్రాడ్యేయేట్ కాలేజీ చైర్ పర్శన్ గా కూడా స్వామి చిన్మయానంద ఉన్నారు.
previous post
next post