(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఆదివారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఏ) రసాభాసగా ముగిసింది. సమావేశంలో సభ్యులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సభ్యులు గొడవకు దిగుతూ కొట్టుకుంటున్న వీడియోను మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
DDCA GOES “ALL OUT”…AND DDCA IS ALL OUT FOR A SHAMEFUL DUCK. Look, how handful of crooks are making mockery of an institution. I’d urge @BCCI @SGanguly99 @JayShah to dissolve @delhi_cricket immediately. Surely, sanctions or even a life ban for those involved. pic.twitter.com/yg0Z1kfux9
— Gautam Gambhir (@GautamGambhir) December 29, 2019
43 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అధికార వర్గానికి చెందిన సంయుక్త కార్యదర్శి రంజన్ మన్చందాను ప్రత్యర్థి వర్గం ప్రతినిధి మఖ్సూద్ ఆలమ్ చెంపదెబ్బ కొట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మపై వినోద్ తిహారాకు చెందిన వ్యక్తులు దాడికి దిగారు. ఈ వీడియోలో డీడీసీఏ అధికారులు ఒకరిపై ఒకరు దాడికి దిగడమే కాకుండా తోసుకోవడం, పిడిగుద్దులు కురిపించుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మీటింగ్లో ఆమోదం పొందిన అజెండాను కొందరు సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మీటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది చాలా అవమానకరమని అన్నాడు. ‘డీడీసీఏ ఆలౌట్ అయింది. అదీ కూడా ఒక అవమానకరమైన డకౌట్. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ.. సంస్థను అవహేళన చేస్తున్నారు. డీడీసీఏను వెంటనే రద్దు చేసి.. గొడవపడిన వారందరిపైనా జీవితకాల నిషేధించడం విధించాలని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాలను కోరుతున్నా’ అని ట్వీట్ లో గంభీర్ పేర్కొన్నాడు.
Thank you members. pic.twitter.com/905oqJTDGM
— DDCA (@delhi_cricket) December 29, 2019