హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్గుడా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. నకిలీ ఈమెయిల్ అడ్రస్ సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో బెయిలు మంజూరు చేయాలని కూకట్పల్లి తొమ్మిదో అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. పదిహేను వేల పూచికత్తు, ఇతర షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. బెయిల్ మంజూరు కావడంతో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న రవిప్రకాశ్ బయటకు వచ్చారు.
రవిప్రకాశ్పై మొత్తం మూడు కేసులున్నాయి. టీవీ9 సంస్థ నిధులను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవిప్రకాశ్పై కేసు నమోదైంది. దీంతో పాటు గతంలో టీవీ9 ఆఫీసుకు వెళ్లిన పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 సీఆర్పీసీ నోటీసులిచ్చారు. ఇటీవల ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసినట్టు రవిప్రకాశ్పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్లో భాగంగా చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
టీవీ9 సంస్థలో నిధుల గోల్మాల్కు సంబంధించి ఒక కేసు.. టీవీ9 ఫండ్ను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవిప్రకాశ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బోనస్, ఎక్స్గ్రేషియా పేరుతో కంపెనీ నిధులను స్వలాభానికి వాడుకుని.. సంస్థకు నష్టం కలిగించినట్టు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. మొత్తం రూ.18 కోట్లు గోల్మాల్ జరిగిందని అలందా మీడియా ఫిర్యాదు రవి ప్రకాశ్పై చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్కి తెలియకుండా రవిప్రకాశ్ నిధులు దారి మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.