అమరావతి :చత్తీస్గఢ్,మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు పోటెత్తి ప్రవహిస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజిలోకి 5,53,077 క్యూసెక్కులు చేరుతుండగా.. బ్యారేజీ నుండి 5,54,774 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
మరోవైపు వంశధార నదిలోనూ వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 36,566 క్యూసెక్కులు చేరుతుండగా 22 గేట్లు ఎత్తి 37,954 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం జలదిగ్భందంలో చిక్కుకున్నది. గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరం ముందు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.