హైదరాబాద్: తెలంగాణ గవర్నర్గా తమిళ సై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్భవన్లో ఆదివారం ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళనాడు మాజీ సిఎం పన్నీర్ సెల్వం, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హజరయ్యారు.
ముందుగా తమిళసై సౌందరరాజన్కు బేగంపేట విమానాశ్రయంలో సిఎం కెసిఆర్, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఉదయం చెన్నై నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ తమిళసై అక్కడ నుండి హెలికాఫ్టర్లో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు.