న్యూఢిల్లీ: వేషం మార్చి నకిలీ పాస్పోర్ట్ తో విదేశాలకు చెక్కేద్దామనుకున్న ఓ వ్యక్తికి ఢిల్లీని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా అధికారులు పట్టుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన జయేశ్ పటేల్ అనే వ్యక్తి 81 ఏళ్ల వృద్ధుడిలా వేషం మార్చుకున్నాడు. తనను తాను 81 ఏళ్ల అమ్రిక్ సింగ్గా మార్చుకున్నాడు. అతని పేరుతో నకిలీ పాస్పోర్ట్ సృష్టించాడు. నెత్తికి తలపాగా, కళ్ల జోడు, తెల్ల గడ్డంతో వీల్ చైర్ మీద న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాడు. అయితే అతని శారీరక రూపానికి, ప్రవర్తనకు సరిపోలకపోవడంతో సిఐఎస్ఎఫ్ అధికారులు అతన్ని ప్రశ్నించారు. మరింత లోతుగా పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. జయేష్ పటేల్ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించామనీ, ఈ చట్టవిరుద్ధమైన చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందని సిఐఎస్ఎఫ్ సీనియర్ అధికారురి తెలిపారు.
previous post