న్యూఢిల్లీ: జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్నూ, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్నూ కేంద్ర ప్రభుత్వం బుధవారం టెరరిస్టులుగా ప్రకటించింది. సుమారుగా నెల క్రితం పార్లమెంట్ ఆమోదించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సవరణ కింద వ్యక్తులను కూడా టెరరిస్టులుగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం సంక్రమించింది. ఈ సవరణ చట్టం కిందే ఇప్పుడు ఆ ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులను టెరరిస్టులుగా ప్రకటించారు.
2008లో జరిగిన ముంబై దాడులకు హఫీజ్ సయీద్ సూత్రధారి. ఇటీవలి పుల్వామా ఉగ్రదాడికి, 2001లో పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడికీ మసూద్ అజర్ కారకుడు.