(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ ప్రశంసించారు. బుధవారం విజయవాడలోని గేట్ వే హోటల్ల్లో ‘ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ రామ్ మాట్లాడుతూ మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. నాణ్యమైన విద్యను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద ఎస్ సి, ఎస్ టి, బిసి విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందని అయన అశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ఎన్ రామ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు