అమరావతి: ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ప్రదర్శించే క్రమంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిపారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదా నుంచి జిల్లా కలెక్టర్ల వరకూ బదిలీలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను మార్చారు.
రాష్ట్రంలో మొత్తం 44 మంది ఐఏఎస్, ఐపిఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారి పేరు – బదిలీ అయిన స్థానం
గౌతమ్ సవాంగ్ – డిజిపి, రహదారుల భద్రత సంస్థ చైర్మన్
విజయ్ కుమార్ – పురపాలక శాఖ కమిషనర్
గిరిజాశంకర్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
పీయూష్ కుమార్ – వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్
క్రాంతిలాల్ దండే – ఇంటర్ బోర్డు కమిషనర్
ప్రద్యుమ్న – మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్
హర్షవర్ధన్ – సాంఘిక సంక్షేమశాఖ డైరక్టర్
జె.మురళి – ముఖ్యమంత్రి ఓఎస్ డి
పి.సీతారామాంజనేయులు – రవాణా శాఖ కమిషనర్
లక్ష్మీనృసింహం- సిఆర్ఏడి కమిషనర్
కాటమనేని భాస్కర్ – టూరిజం, యువజన, సాంసృతిక శాఖ ఎండి
ఎంఎం నాయక్ – ఎక్సైజ్ శాఖ కమిషనర్
ప్రవీణ్ కుమార్ – వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్
కాశిరెడ్డి విఆర్ఎన్ రెడ్డి – డిజి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్
కేఆర్ఎం కిశోర్ కుమార్ – హోంశాఖ ముఖ్యకార్యదర్శి
కోన శశిధర్ – పౌరసరఫరాల శాఖ కమిషనర్
బి.శ్రీధర్ – ఏపీ జెన్ కో ఎండి
నాగులాపల్లి శ్రీకాంత్ – ఏపి ట్రాన్స్ కో ఎండి
ముఖేశ్ కుమార్ మీనా – సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి
ఎంటీ కృష్ణబాబు – రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి
కె.దమయంతి – మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి
బి.రాజశేఖర్ – పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
ఆర్సీ సిసోడియా – సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి
అనంతరాము – గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి
కేఎస్ జవహర్ రెడ్డి – వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
జేఎస్వీ ప్రసాద్ – ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
ఆదిత్యనాథ్ దాస్ – జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
నీరబ్ కుమార్ – అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పూనం మాలకొండయ్య – వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కరికాల వలవన్ – బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రజత్ భార్గవ – పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ముఖ్యకార్యదర్శి
చిరంజీవి చౌదరి- ఉద్యాన శాఖ కమిషనర్
జిల్లా కలెక్టర్లు
డి.మురళీధర్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
నారాయణ్ భరత్ గుప్తా – చిత్తూరు జిల్లా కలెక్టర్
వీరపాండ్యన్ – కర్నూలు జిల్లా
ముత్యాలరాజు – పశ్చిమ గోదావరి జిల్లా
ఎస్.సత్యనారాయణ – అనంతపురం జిల్లా కలెక్టర్
ఎంవీ శేషగిరిబాబు – నెల్లూరు జిల్లా కలెక్టర్
వినయ్ చంద్ – విశాఖ జిల్లా కలెక్టర్
పి.భాస్కర్ – ప్రకాశం జిల్లా
శామ్యూల్ ఆనంద్ – గుంటూరు జిల్లా
అజయ్ జైన్, విజయానంద్ లను జిఎడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.