ఎన్నికల ప్రచారంలో నేతల మాటలకు అడ్డు, అదుపు లేకుండా పోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లం ఝాబువా లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుమన్ సింగ్ దమోర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత దేశానికి తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ తగిన వ్యక్తి కాదని ఆయన అన్నారు. ఆయన ప్రధానమంత్రి కావాలని పట్టుబట్టకపోయి ఉంటే, అసలు దేశ విభజన జరిగి ఉండేదే కాదని చెప్పారు. మహ్మద్ అలీ జిన్నా ఉన్నతమైన వ్యక్తి అని చాలా చదువుకున్న వ్యక్తి అని చెప్పిన గుమన్ సింగ్, ఆయన భారత దేశానికి ప్రధాని అయి ఉంటే దేశ విభజన జరిగేది కాదన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ప్రధాని కావడం వల్లే దేశం రెండుగా విడిపోవాల్సి వచ్చిందని గుమన్ అన్నారు. దేశ విభజన పాపం కాంగ్రెస్ను ఎప్పుడూ వీడదని గుమన్ వ్యాఖ్యానించారు.
#WATCH Gumansingh Damor, BJP candidate from Ratlam-Jhabua LS seat: Azadi ke samay agar Nehru zidd nahi karte, to is desh ke 2 tukde nahi hote. Mohd Jinnah, ek advocate, ek vidwan vyakti, agar us waqt decision liya hota ki hamara PM Md. Jinnah banega, to is desh ke tukde nahi hote pic.twitter.com/w9mRk9K9ju
— ANI (@ANI) May 11, 2019
భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో నెహ్రూను దేశ ప్రధానిగా ప్రతిపాదించకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని దమోర్ అన్నారు. దేశం రెండుగా విడిపోయేది కానే కాదన్నారు. జిన్నా ప్రధాని అయి ఉంటే లెక్క మరోలా ఉండేదన్నారు. ఒకవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారు.