ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు. మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతుంటారు. కొంతమందికి అదృష్టం వద్దన్నా వరిస్తుంది. ఇక మరికొందరికీ అకస్మాత్తుగా కలసి వస్తుంది. అయితే దీనికి అదృష్టం అవసరం. మీకు అదృష్టం ఉంటే మీరు కూడా లక్షాధికారి కావచ్చు. దీనికోసం కష్టపడక్కర్లేదు. కేవలం ఒక్క రూపాయి నోటు మిమ్మల్ని మారుస్తుంది.
ఒక్క రూపాయి నోటుంటే…మీరు లక్షాధికారి అయ్యే అవకాశం మీ చెంత ఉన్నట్టే. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? పాత వస్తువులు సేకరించే అలవాటున్న వారు ప్రస్తుతం 786 సీరీస్ నంబర్ నోటు కోసం లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యేక మతానికి చెందిన వ్యక్తులు ఈ ప్రత్యేక నోట్లను పవిత్రంగా భావిస్తున్నారు. కొంతమంది అలాంటి నోట్లను జమ చేయడం కూడా ఇష్టపడతారు. అలాంటి నోట్లు కనుక మీ వద్ద ఉంటే మీరు ధనవంతులు అయినట్లే. మీరు అలాంటి నోట్లు లను ఆన్లైన్లో అమ్మవచ్చు. ఇంట్లో కూర్చున్న చోటే ఒప్పందం చేసుకొని మంచి డబ్బును పొందవచ్చు. అరుదైన కరెన్సీ నోట్లు ఇండియా మార్ట్ వన్ సైట్లలో అమ్మవచ్చు.పాతనోట్లు, నాణాలకు ఈబై, ఇండియన్ ఓల్డ్కాయిన్ వెబ్సైట్లలో ఆన్ లైన్ వేలం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సైట్లలో గతంలో కొన్ని నాణాలకు కోట్ల రూపాయలు పలికిన సందర్భాలు ఉన్నాయి.2018లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు పురాతన నాణాల వేలం నిర్వహించగా కోట్ల రూపాయలు పలికాయి. 1740కి సంబంధించిన ఒక నాణెం విలువ రూ. 3 కోట్లు పలికింది. అదేవిధంగా 400 ఏళ్ల పురాతన వెండి నాణెం (శివుని చిత్రం కలిగినది) వేలంలో రూ. 3.5 లక్షలు పలికింది.
అందువల్ల అరుదైన నాణాలు, నోట్లు ఉంటే మీరూ అదృష్ణాన్ని పరీక్షించుకోవచ్చు. మీ వద్ద ఉన్న నాణెం లేదా నోటును ఫొటో తీసి ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వేలం మొదలవుతుంది. కానీ కొన్ని ఫేక్ వెబ్ సైట్లుంటాయి. సైబర్ నేరగాళ్లు వల వేసే ప్రమాదం ఉంది.అందువల్ల వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే నాణెం, నోటు కొంటామని ఫోన్లు వచ్చినా ఎంతో నమ్మకం కుదిరాక, అటు వైపు వ్యక్తి నిజంగా కొనే వ్యక్తి అన్న నమ్మకం కలిగాకే అమ్మకానికి ఉంచాలి. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది. ఈ నోటు కూడా చాలా ఖరీదు. ఓ నివేదిక ప్రకారం కొంతకాలం క్రితం ట్రాక్టర్ చిత్రాన్ని కలిగి ఉన్న 5 రూపాయల నోటు వేలంలో లక్షల రూపాయలు పొందారు.