దేశానికి మొదటి మహిళా టీచర్… జ్యోతిబాపూలే భార్యగా అందరికి సూపరిచితురాలిగా… మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే మొదట అక్షర స్వేచ్ఛ రావాలని పోరాడిన మహిళ సావిత్రి బాపూలే జయంతి నేడు… ఉత్తరాది రాష్ట్రాల్లో సావిత్రి బాపూలే ను మొదటిగురువు గానే ఇప్పటికీ మహిళలంతా భావిస్తారు… వారి స్వయం ప్రకటిత ఆర్థిక దారుల్లో ఆమె పాత్ర ఉందనేది వారు గుర్తిస్తారు. మహిళా ఖచ్చితంగా చదువుకుంటేనే తన మెరుగుపడుతుందని బలంగా నమ్మారు సావిత్రిబా పూలే. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి తనకు తెలిసిన వారికి అప్పట్లోనే బలంగా నిలబడి అక్షరజ్ఞానం నేర్పించారు… ఆమె జయంతి సందర్భంగా అసలు భారతదేశంలో అని నమ్మిన సిద్ధాంతాలు మహిళ అక్షరాస్యత శాతం ఎంత పెరుగుతుందో ఒకసారి గమనిస్తే…
** 2011 జాతీయ గణన ప్రకారం భారతదేశంలో 74.4 శాతం అక్షరాస్యతా రేటు నమోదు అయింది. 2017-18 లో జాతీయ సర్వేలో 77.7 శాతం నమోదు అయ్యింది. అర్బన్ ఏరియాలో 87.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 73.5 శాతం అక్షరాస్యత శాతం నమోదు అయ్యింది.
** మగవారిలో 24.7 శాతం అక్షరాస్యత నమోదు అయి తే మహిళల్లో 70 పాయింట్ 3 శాతం మాత్రమే, అక్షరాస్యత శాతం నమోదయింది. అయితే మగవారితో పోలిస్తే ఆడవారిలో 11 శాతం పైగా చదువులు డ్రాప్ చేయకుండా కొనసాగిస్తున్నారు. ఇది శుభ పరిణామం.
** కేరళ మహిళ అక్షరాస్యతలో అగ్రభాగంలో కొనసాగుతోంది. అక్కడ 98 శాతం వరకు అక్షరాస్యత ఉన్నట్లు గుర్తించారు. బీహార్లో అత్యంత తక్కువగా 62 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఎక్కడ మహిళల అక్షరాస్యత శాతం 40 మించలేదు.
** ఉత్తరాది కంటే దక్షిణాది లో అక్షరాస్యత మెరుగుపడుతుంది. జాతీయ సర్వే లెక్కల ప్రకారం 7 సంవత్సరాలు దాటి.. వారికి సరైన పేరు రాసుకోవడం వచ్చి ఉంటే వారి అక్షరాస్యత గా పరిగణిస్తున్నారు. ఇది ఉత్తరాది కంటే దక్షిణాదిలో వేగంగా పెరుగుతుంది ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అక్షరాస్యతతో పాటు మహిళల అక్షరాస్యత ఎక్కువ అవుతోంది.
ఎన్నో కారణాలు!
జాతీయ లిటరసీ సర్వే ప్రకారం దక్షిణాది కంటే ఉత్తరాది లోనే ఆడవారి చదువు డ్రాపింగ్ ఎక్కువగా ఉంది. దీనికి అనేక కారణాలు సామాజిక కారణాలు అనేవి ఎక్కువగా వారి చదువును ప్రభావితం చేస్తున్నాయని సర్వేలోని సభ్యులు గుర్తించారు.
** ఉత్తరాదిలో తక్కువ వయస్సు పెళ్లిళ్లు అధికం. ఆడపిల్లకు 17 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారిని పెళ్లి చేసి పంపించడం అక్కడ సంప్రదాయం. దీంతో అత్తవారింట్లో వారి చదువు సరిగా సాగడం లేదు.
** పెళ్లి అయిన అనంతరం అత్తింట్లో బాధ్యతలు బరువులు ఎక్కువగా ఉండటం పిల్లలు పుట్టడం వంటి విషయాలు ఆడపిల్లలను చదువుకు ఎక్కువగా దూరం చేస్తున్నాయి.
** అలాగే పేదరికం సైతం ఆడపిల్లల చదువు పై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. కనీసం తినడానికి కూడా లేని పరిస్థితిలో వారు చిన్ననాటి నుంచే కూలి పనులకు వెళుతూ కుటుంబానికి ఆ చేదోడు వాదోడు గా తోడుగా సాయి పడుతున్నారు.
** దక్షిణాది రాష్ట్రాల్లో ఆడపిల్ల చదువుకుంటే తమ మాట వినదు అనే కోణంలో గ్రామీణప్రాంతాల్లో చదువు మానిపిస్తున్నారు. ఎక్కువ చదువుకుంటే తర్వాత పెద్ద సంబంధాలు తీసుకురావాలనే కోణంలో ఎక్కువగా చదువును మనిపిస్తున్నట్లు గుర్తించారు.