న్యూఢిల్లీ: ఉపఎన్నికలలో ఒంటరి పోరాటమేనని మాయావతి స్పష్టం చేసారు. సార్వత్రిక ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీతో కలిసి ఏర్పాటు చేసిన మహఘటబంధన్ విఫలం కావడంతో పొత్తు నుండి బయటకువస్తున్నట్లు ఆమె నిన్న సూచనప్రాయంగా చెప్పారు. అదే విషయాన్ని ఈరోజు ఖాయం చేశారు.
దారులు వేరు కావాల్సివస్తే అలాగే కానివ్వండి అని సమాజావాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఉపఎన్నికలు జరుగుతున్న 11 సీట్లలోనూ మాయావతి వంటరిగా పోటీ చేయదలిస్తే తాము కూడా అన్ని సీట్లలోనూ పోటీ చేసే విషయం పరిశీలిస్తామని ఆయన అన్నారు.
వాస్తవ రాజకీయ పరిస్థితులను కాదనలేమని మాయావతి వ్యాఖ్యానించారు. అయితే ఈ విడిపోవడం శాశ్వతం కాదని ఆమె అన్నారు. పార్టీ కార్యకర్తలలో మార్పు తెచ్చుకోవాలని ఆమె సమాజ్వాదీ నాయకత్వానికి సూచించారు. పొత్తు పెట్టుకున్నప్పటికీ సమాజ్వాదీ వోటు బ్యాంకు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్దులకు బదిలీ కాలేదని ఆమె వాదిస్తున్నారు. కానీ తమ వోటు బ్యాంకు ఎస్పి అభ్యర్ధులకు బదిలీ అయిందని ఆమె అంటున్నారు.