పుల్వామా సూయిసైడ్ బాంబింగ్కు వ్యతిరేకంగా ఇండియా వాయుసేన విమానాలు పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్యా మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇండియా జలాంతర్గామి ఒకటి తమ జలాల్లోకి ప్రవేశించిందన్న పాకిస్తాన్ ప్రకటన సంచలనం సృష్టించింది.
దీనికి సమాధానంగా, పాకిస్తాన్ బూటకపు ప్రచారానికి పాల్పడుతోందని ఇండియా ఆరోపించింది. యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం పాకిస్తాన్ లక్ష్యమని ఇండియా నౌకాదళం వ్యాఖ్యానించింది.
As was stated during the Jt Press Statement on 28 Feb 19, the #IndianNavy remains deployed as necessary to protect National Maritime Interests. Over the past several days we have witnessed Pakistan indulging in false propoganda and spread of misinformation. 1/2
— SpokespersonNavy (@indiannavy) March 5, 2019
నౌకాదళం వర్గాల సమాచారం ప్రకారం, తమ వాదనకు మద్దతుగా పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో 2016 నవంబర్ నాటిది. అందులో ఆ వీడియో తీసిన సమయాన్ని సూచించే స్టాంప్ను ఫొటోషాప్ ద్వారా మార్చారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
హిందూమహా సముద్రంలో నౌకాదళం నిర్వహించే అన్ని అగ్ర రాజ్యాలకూ ఇందులో నిజానిజాలు తెలుసునని ఇండియా నౌకాదళం అంటున్నది.
video courtesy: dawn