(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇటీవల అండమాన్ సముద్ర జలాల్లో ఇండియా ఎకనమిక్ జోన్లోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకను భారత నౌకాదళం వెనక్కు తరిమినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది.
చైనా ఆర్మీకి చెందిన పరిశోధనా నౌక భారత జలాల్లో రీసెర్చి కార్యకలాపాలు నిర్వహిస్తూ భారత నేవీ నిఘా విమానం కంటబడింది. అది ముందు అనుమతి తీసుకోకుండా భారత సముద్రజలాల్లో ప్రవేశించింది కాబట్టి దాన్ని వెళ్లగొట్టామని నేవీ అధికారులు చెప్పినట్లు పిటిఐ తెలిపింది.
మరోపక్క నౌకాదళం చీఫ్ మంగళవారం సాంవత్సరిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇండియా స్వంతంగా నిర్మించే మొదటి విమానవాహక నౌక 2022 నాటికి సిద్ధమవుతుందని చెప్పారు. దానిపై మిగ్ 29కె యుద్ధవిమానాలను ఉంచుతామని తెలిపారు.