ముంబైః భారత తొలి మహిళా డీజీపీగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన కాంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ముంబైలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాంచన్ చౌదరి 1973 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా పదవీబాధ్యతలు చేపట్టారు. 2007 అక్టోబర్ 31న ఆమె పదవీ విరమణ చేశారు. అనంతరం ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా హరిద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
కాంచన్ మృతి పట్ల ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశ తొలి మహిళా డీజీపీ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. పదవీ విరమణ తర్వాత కూడా ఆమె ప్రజా జీవితంలోనే ఉన్నారని తెలిపారు. చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేయాలని ఆమె తపించారని అన్నారు. ఆమె మరణం తీరని లోటు అని ట్వీట్ చేశారు.
Saddened to know about the passing away of the country's first woman DGP Ms Kanchan Chaudhary Bhattacharya.
She remained active in public life after her retirement and wanted to serve the country till her very last.
Will miss her. RIP— Arvind Kejriwal (@ArvindKejriwal) August 27, 2019
ఉత్తరాఖండ్ పోలీసులు కూడా కాంచన్ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప నాయకత్వ లక్షణాలతో పాటు, మంచి హృదయం ఉన్న గొప్ప అధికారి ఆమె అని కొనియాడారు. ఆమె తన పని తీరుతో ఎన్నో అవార్డులను స్వీకరించారని గుర్తు చేసుకున్నారు. దేశంలో తొలి మహిళా డీజీపీ, రెండో మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అయిన కాంచన్ మరణం తమను ఎంతో ఆవేదనకు గురి చేస్తోందని ట్వీట్ చేశారు.
प्रदेश की पूर्व DGP श्रीमती कंचन चौधरी भट्टाचार्य, 1973 बैच की IPS अधिकारी, जो कुछ समय से बीमार चल रही थी, के निधन पर #UttarakhandPolice उनके परिजनों के प्रति शोक संवेदना व्यक्त करते हुए उत्तराखंड पुलिस में उनके द्वारा दिए गए अभूतपूर्व योगदान को याद करती है।@IPS_Association pic.twitter.com/dmk3IRthg6
— Uttarakhand Police (@uttarakhandcops) August 26, 2019