(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
లడఖ్లోని మంచుకొండల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకులను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)కి చెందిన జవాన్లు ఘనంగా నిర్వహించారు. జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లఢఖ్లో తొలి సారి గణతంత్ర వేడకలు జరిగాయి.
మంచుకొండల్లో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మద్య జవాన్లు భరతమాతకు జయజయధ్వానాలు పలుకుతూ వందేమాతరం నినాదాలు మధ్య జాతీయ జెండా ఎగురవేశారు. సుమారు 17000 అడుగుల ఎత్తులో ఇండో టిబెటిన్ కొండల్లో ఈ హిమవీరులు జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఐటిబిపి జవాన్లు మన దేశ సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తూ దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నెటిజన్లు వారి సేవలను ప్రశంసిస్తున్నారు.
#WATCH Indo-Tibetan Border Police (ITBP) personnel with the national flag celebrating Republic Day at 17000 feet in snow today. The temperature in Ladakh at present is minus 20 degrees Celsius. 'Himveers' chanting 'Bharat Mata Ki Jai' and 'Vande Mataram'. pic.twitter.com/ANCe8txnFI
— ANI (@ANI) January 26, 2020