(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. అనుకున్నట్లుగానే దాడులకు దిగింది. అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 7 సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇరాక్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాక్లోని అసద్, ఇర్బిల్ ఎయిర్ బేస్లపై దాదాపు డజనకుపైగా క్షిపణులతో ఇరాన్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడులకు తామే పాల్పడినట్టు ఇరాన్ తన అధికారిక మీడియాలో ప్రకటించింది. ఇది ఆరంభమేనని, మున్ముందు దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైన్యాలు పశ్చిమాసియాను విడిచివెళ్లాలని సూచించింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
VIDEO: Video footage released by Iranian state media purportedly shows rockets launched at Ain al-Asad airbase, a US military installation in Iraq pic.twitter.com/169xJGWK8t
— AFP News Agency (@AFP) January 8, 2020
క్షిపణులతో దాడిచేసినట్టు పెంటగాన్ ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణి దాడిలో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇరాక్లోని అమెరికా, సంకీర్ణ దళాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పాల్పడినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రజా సంబంధాలు శాఖ కార్యదర్శి జొనాథన్ హాఫ్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాక్ దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది.
మరోవైపు, ఇరాన్ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాక్ దాడులు జరిపినట్లు ధృవీకరించారు. అయితే ప్రాణనష్టంపై ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ క్షిపణుల దాడిలో జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా తమకు అత్యంత శక్తివంతమైన సైన్యం ఉందంటూ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు చేశారు. దీనిపై రేపు ఉదయం ప్రకటన చేస్తానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తాజా పరిస్థితులపై ట్రంప్ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్ హౌస్ వెల్లడించింది.
https://twitter.com/realDonaldTrump/status/1214739853025394693
We are aware of the reports of attacks on US facilities in Iraq. The President has been briefed and is monitoring the situation closely and consulting with his national security team.
— Kayleigh McEnany 45 Archived (@PressSec45) January 7, 2020
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. తాజా పరిణామాలు ఎంత దూరం వెళ్తాయోననే ఆందోళన సర్వత్ర నెలకొంది. రానున్న రోజుల్లో ఇరాన్ పై తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులను అమెరికా చేయవచ్చని, విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.