అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్వ పీఏ శ్రీనివాస్ నివాసంలో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల ముందు వరకూ శ్రీనివాస్ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన సచివాలయం జీఏడీలో పనిచేస్తున్నారు.
previous post
next post