(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలయిన పిటిషన్ విచారణలో ప్రభుత్వం తరపున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించారు. ఆయనకు లాయర్ ఫీజు కింద అడ్వాన్సుగా కోటి రూపాయలు ఇస్తున్నారు. దానికి సంబంధించిన జీవోను బుధవారం జారీ చేశారు. కేసు వ్యవహారానికి సంబంధించి అయిదు కోట్ల రూపాయలు వేరే సిద్ధంగా ఉంచాలని కూడా జీవోలో పేర్కొన్నారు.
వైఎస్ జగన్ తన తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లకు పైగా అక్రమార్జన చేశారటూ సీబీఐ వేసిన కేసుల్లో కూడా జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినపుడు ఆ కేసును వాదించిన ప్రముఖ లాయర్లలో ముకుల్ రోహత్గీ ఒకరు.