(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: బిఏసి సమావేశం అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శానమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించారు.
ముందుగా జరిగిన కేబినెట్ భేటీలో శాసనమండలి రద్దు చేయాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే.