అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా స్థానిక నాయకులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
ఇటీవల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాయపడిన వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించాలని వారు కోరారు. వారి కోరిక మేరకు పవన్ పర్యటనకు సుముఖత వ్వక్తం చేశారు. పర్యటన ఎక్కడెక్కడ జరగాలి, ఏ విధంగా జరగాలి అనే కార్యాచరణను పార్టీ నాయకులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
రాజధాని గ్రామాలలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక సారి పర్యటించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న తరువాత తొలిసారి జనసేనాని పర్యటించనున్నారు.