అమరావతి: తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ఏపి అధికార భాష సంఘం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తీసివేసి ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
భాష, సంస్కృతి ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను చూసి నేర్చుకోవాలని పవన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తే మన భాష, సంస్కృతి మరుగున పడిపోతాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు మాధ్యమాన్ని పాఠశాలలలో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ,ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘం ఏం చేస్తుంది?
— Pawan Kalyan (@PawanKalyan) November 10, 2019
YCP leadership should take lessons from Telangana CM ‘Sri KCR’ how to safeguard language and culture. The following book was brought for ‘ Telugu mahasabhalu’ in 2017, Hyderabad. pic.twitter.com/aylfIifJln
— Pawan Kalyan (@PawanKalyan) November 10, 2019