అమరావతి: తెలుగు భాషను కాపాడుకోవడానికి జనసేన ముందడుగు వేయడానికి సంకల్పించిందనీ, అందుకు గానూ చేపట్టిన ‘మన నుడి – మన నది’ ఉద్యమానికి ప్రజలు తమ అమూల్యమైన సలహాలు అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు గానూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగాలు ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ నాల్గవ తేదీ వరకూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ పని చేస్తాయని ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజలు వారి సలహాలు, సూచనలను వాట్స్ప్, ఈ-మెయిల్ ద్వారా గాని తెలియజేయవచ్చని చెప్పారు. ‘మన నుడి – మన నది’ ప్రత్యేక విభాగాలు విజయవాడ, హైదరాబాదులలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. విజయవాడ బృందంలో ఎల్ జోగినాయుడు, ఎల్ శ్యామ్, వివేక్, హైదరాబాద్ విభాగంలో పి శ్రీనివాసరావు, ఎ జయ కళ్యాణి, ఎ ప్రణయ్ ఉంటారని పేర్కొంటూ వారి వాట్స్ప్ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లను ఇచ్చారు.
' మన నుడి – మన నది ' ఉద్యమానికి
మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి- JanaSena Chief Sri @PawanKalyan#OurRiversOurMotherTongue pic.twitter.com/cbys378DgB— JanaSena Party (@JanaSenaParty) November 23, 2019