ఎట్టకేలకు జనసేన నేత పవన్ కళ్యాణ్ తన పార్టీ విజన్ ఏమిటో వివరించారు. ఎన్నికల ముంగిట రాజమండ్రిలో గురువారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన తన మానిఫెస్టో ప్రకటించారు. ఇన్నాళ్లూ అందరినీ తిట్టావు. నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. అధికారంలోకి వస్తే ఏం చేసేదీ చెబుతున్నాం అంటూ ఆయన తన పార్టీ మానిఫెస్టో ప్రకటించారు.
జనసేన మానిఫెస్టోలో రైతులకు పెద్ద పీట వేశారు.
సాగుసాయం కింద రైతులకు ఏడాదికి ఎనిమిది వేల రూపాయల సహాయం.
60 ఏళ్లు పైబడిన చిన్న సన్నకారు రైతులకూ, కౌలు రైతులకూ నెలకు అయిదు వేల రూపాయల పెన్షన్.
భూమి కోల్పోయిన రైతుల సమస్యలకు 2013 భూసేకరణ చట్టం కింద పరిష్కారం.
భవిష్యత్తులో పరిశ్రమలకు భూములు ఇచ్చే రైతులకు ఆ పరిశ్రమలలో భాగస్వామ్యం కల్పన.
ఉభయ గోదావరి జిల్లాలలో అయిదు వేల కోట్ల రూపాయలతో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు. అన్ని జిల్లాలలో శీతల గిడ్డంగులు, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు.
రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ యూనిట్ల సరఫరా.
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తి.
విద్య, ఉపాధి:
ఒకటవ తరగతి నుంచి పిజి వరకూ ఉచిన విద్య అందిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
విద్యా సంస్థలకు గుర్తింపు కార్డుపై ఉచిత రవాణా.
డొక్కా సీతమ్మ కాంటీన్లలో విద్యార్ధులకు ఉచిత భోజన సదుపాయం.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో, వీలైతే మండలం పరిధిలో డిగ్రీ కాలేజి ఏర్పాటు.
అన్ని కళాశాలల్లో ఇన్నొవేషన్ సెంటర్లు.
నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కోసం దాదాపు లక్ష బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఆరు నెలల్లో భర్తీ చేస్తామని పవన్ ప్రకటించారు.
ప్రతి సంవత్సరం పది లక్షల ఉద్యోగావకాశాలు సృష్టి.
వైద్యం, ఆరోగ్యం:
ఇప్పుడున్నదానికన్నా బడ్జెట్ రెండితలు.
ఆర్ధిక స్తోమతుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా.
ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్నీ 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం.
చిరు వ్యాపారులకూ, వీధి వ్యాపారులకూ పావలా వడ్డీపై అయిదు వేల రుణం.
కాపులకు రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూలులో ఉంచండం ద్వారా ఖరారు.
బిసిలకు అయిదు శాతం రాజకీయ రిజర్వేషన్లు.
ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యపై రెండు వర్గాలను కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించడం.
ముస్లింల ఆర్ధిక, సామజిక అభివృద్ధికి సచార్ కమిటీ సిఫార్సుల అమలు.
మహిళలకు బంగారంపై 50 పైసల వడ్డకే రుణం. సంవత్సరంలోపు చెల్లిస్తే 25 పైసల వడ్డీ.
మత్సకారులకు 300 రోజులు ఉపాధి. తుఫాను సమయంలో పని లేకపోతే రోజుకు 500 రూపాయల ఆర్ధికసాయం.
సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టేందుకు మర పడవల సహాయం.
అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోపు మత్సకారులకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పన.
మహిళల భద్రతకు సంబంధించి కఠిన చట్టాలు.
అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు చట్ట సభల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్ కోసం కృషి.
ప్రభుత్వం తరుపున మహిళలకు సంక్రాంతికి చీరల పంపిణీ.
డ్వాక్రా మహిళలకు మహిళా బ్యాంకు.
మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్.
జిల్లాకో మహిళా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
మండలానికో కల్యాణ మండపం.
రెల్లి యువతకు 50వేల రూపాయల వడ్డీలేని ఋణం.
రెల్లి కార్మికులకు ఆటోరిక్షా కొనుగోలుపై 50 సబ్సిడీ.
ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న రెల్లి ఆడపడుచులకు ఉచితంగా స్కూటర్లు.
యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలు.
జిల్లాకి 10 చొప్పున 130 స్మార్ట్ సిటీలు.