(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి అడ్డుకోవడంతో కౌన్సిల్నే రద్దు చేస్తూ సిఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్న న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించింది.
ఏపి హైకోర్టు.. ‘హడావుడిగా రాజధాని తరలింపు తప్పు అంది. తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరికాదు అంది. ఉద్యమంలా చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసుకునే కార్యక్రమాన్ని తప్పుబట్టింది’ అని జనసేన పేర్కొన్నది.
‘నీ నియంత నిర్ణయాలకి అడ్డుపడుతుందని న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా’ అంటూ సిఎం జగన్ రెడ్డిని జనసేన ప్రశ్నించింది.
న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి? pic.twitter.com/Gclps7rD2J
— JanaSena Party (@JanaSenaParty) January 28, 2020