అమరావతి, మార్చి 11: జనసేన పార్టీ 32 అసెంబ్లీ, తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం వీరి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. రాజమండ్రి రూరల్ స్థానం కందుల దుర్గేష్, గుంటూరు పశ్చిమకు తోట చంద్రశేఖర్, మమ్మిడివరంకు పితాని బాలకృష్ణ, తెనాలికి నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాడు సీటు రావేల కిషోర్ బాబు, పాడేరుకు పసుపు లేటి బాలరాజు, కావలి నుండి పసుపు లేటి సుధాకర్, ఏలూరుకు నర్రా శేషు కుమార్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, తాడేపల్లిగూడెం – బోలిశెట్టి శ్రీనివాసరావు, రాపాక వరప్రసాద్, పి. గన్నవరం -పాముల రాజేశ్వరి, ధర్మవరం. మధుసూదన్ రెడ్డి, కడప . సుంకర శ్రీనివాస్, కాకినాడ రూరల్ . అనిశెట్టి బుల్లబ్బాయ్, తుని రాజ అశోక్ బాబు, మండపేట. దొమ్మేటి వెంకటేశ్వర్లులను, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు శేఖర్, మారిశెట్టి రాఘవయ్య, ఆకుల సత్యనారాయణ, చింతల పార్థసారథి, గేదెల శ్రీనుబాబుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
అమలాపురం పార్లమెంట్ స్థానానికి డిఎంఆర్ శేఖర్, రాజమండ్రి పార్లమెంట్ నుండి ఆకుల సత్యనారాయణల పేర్లను అధికారికంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు.