అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పర్యటన రాజకీయ లబ్దికోసం కాదని పవన్ వెల్లడించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో యురేనియం తవ్వకాల వల్ల అక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి వాళ్లకు ఎలా న్యాయం చేయాలో చూద్దామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన అధికార ప్రతినిధుల సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, నేతలతో కలిసి పులివెందులలో పర్యటిద్దామని ఆయన చెప్పారు.
previous post
next post