ఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్ ఐదవ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో 2017లో తమిళనాడు ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ను ఏర్పాటు చేసింది.
ఈ విచారణను ఆపేయాలంటూ చెన్నైలోని అపోలో ఆసుపత్రి యాజమాన్యం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపిన ఆర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే ఇచ్చింది.