(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో బిజెపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ముగిసింది. జెపి నడ్డాకు అమిత్షా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సహా పలువురు ముఖ్య నేతలు నడ్డాకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటి వరకూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నడ్డా వ్యవహరించారు. గతంలో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు, ఆ తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు.