(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం కడప తెలుగు తమ్ముళ్లలో లేకపోయింది. కడప నియోజకవర్గ పరిధిలోని సమీక్ష సమావేశంలో చంద్రబాబుకు దళిత కార్యకర్తలు సమస్యలు చెప్పుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై ఉన్న అసంతృప్తిని అధినేత ముందు వెళ్లగక్కారు. వైసీపీ నేతలకు ఆయన దగ్గరవుతున్నారని సుబ్బయ్య అనే వ్యక్తి ఆరోపించారు. దీంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వర్గీయులు దాడికి దిగారు. సుబ్బయ్య అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. అధినేత చంద్రబాబు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. దళితులు అయినందుకు తమను చిన్న చూపు చూస్తున్నారని సుబ్బయ్య ఆరోపించారు. ఈ ఘటనపై సుబ్బయ్య వర్గీయులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
https://youtu.be/f5KvioC0qEU
video courtesy: AP 24/7