అమరావతి: ఏపీలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని.. చంద్రబాబు ప్రభుత్వ బాటలోనే జగన్ నడుస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కత్తి మహేష్ సోషల్ మీడియలో ఓ పోస్ట్ పెట్టారు.
‘ఏపీ ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ నిధుల్ని అమ్మఒడి పథకం కోసం పక్కదాకి మళ్లించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో కూడా ఇలాగే చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతిని ఇలాగే అడ్డుకుంది. ప్రస్తుతం అదే ప్రయత్నం జరుగుతోంది’అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని అమ్మఒడి పథకానికి మళ్లిస్తూ ప్రభుత్వ జారీ చేసిన జీవోను కూడా మహేష్ పోస్ట్కు జతపరిచారు.
https://www.facebook.com/photo.php?fbid=10158008580576115&set=a.10150224693411115&type=3&eid=ARDd2FSQZj88-S_c_5QWnUFo6ZGnodnBPS20fpT23vmD_aAua0S6bFCmGum-h9ZGkltaQqG7RCe7qKtb
అమ్మఒడి పథకం అమలు చేసేందుకు వివిధ కార్పొరేషన్లల నిధుల్ని అమ్మఒడి పథకానికి మళ్లించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించి రూపాయి ఇవ్వకుండా అమ్మ ఒడి పేరుతో బొమ్మ చూపిస్తున్నారని మాజీ మంత్రి లోకేష్ కూడా విమర్శించారు.
ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తెస్తున్న పథకాల్లో అమ్మఒడి ప్రత్యేకమైనది. పిల్లలంతా బడికి వెళ్లాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తెచ్చింది. ఈ నెల 9న చిత్తూరులో సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.6,455 కోట్లు కేటాయించింది. పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లి బ్యాంక్ అకౌంట్లో నేరుగా ఏడాదికి రూ.15వేలు చేరతాయి. ఒకటి నుంచీ ఇంటర్ వరకూ చదివే పిల్లల తల్లులకు ఇది వర్తిస్తుంది. దీని ద్వారా ఏపీలో 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం కలగనుంది. ఏటా జనవరిలో ఈ డబ్బును ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా పిల్లలంతా స్కూళ్లకు వెళ్తారని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, అమ్మఒడి పథకం అమలు విషయంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కొన్ని కండీషన్లు సమస్యగా మారుతున్నాయి. కుటుంబంలో ఉండే అందరు పిల్లలకూ ఇది వర్తించదనీ… ఎంత మంది పిల్లలు ఉన్నా… రూ.15 వేలే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే కరెంటు మీటర్ 300 యూనిట్లు దాటితే… ఆ కుటుంబం పేరును లబ్దిదారుల జాబితా నుంచీ తొలగిస్తున్నారని తెలిసింది. అంతేకాదు కుటుంబంలో ఎవరికైనా ఫీజు రీయింబర్స్మెంట్ జరిగితే కూడా ఈ స్కీం వర్తించదని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం పూర్తి వివరాలు ప్రకటించాలని, పథకం ఎవరెవరికి వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.