KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవాక్కయ్యే కుంభకోణం ఒకటి బయటపడ్డట్లు సమాచారం. అధికారికంగా ఈ విషయంలో ప్రకటన వెలువడనప్పటికీ కేసీఆర్ ద్వారా ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, రెమ్ డెసివిర్, ఇంజెక్షన్లు ఇలా కరోనా చికిత్సలో భారీ దందా జరిగిందని సమాచారం.
ఇదీ స్కాం…
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో ఎంజీఎం ఆస్పత్రికి పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. ఇక్కడ కరోనా చికిత్స సైతం అందుతోంది. దీనికి సంబంధించిన స్కాం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికి సరఫరా చేసిన 1,100 ఆక్సిజన్ ఫ్లో మీటర్లలలో 700, 6478 రెమ్డెసివిర్, ఇంజెక్షన్ల లలో సగానికిపైగా మాయమయ్యాయని సమాచారం. ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, రెమ్ డెసివిర్, ఇంజెక్షన్ల కుంభకోణం గుట్టుపై ప్రభుత్వ పెద్దలు కూపీ లాగుంతుంటే ఒక్కొక్కటిగా విస్మయకర విషయాలు బయటకు వస్తున్నాయి.
కేసీఆర్ ఫైర్…
కుంభకోణంలో మెడికల్ మాఫియా పాత్ర కూడా ఉందని సమాచారం. ఈ అక్రమాల మాఫియా గుట్టుపై సీఎం కేసీఆర్ కు నివేదిక చేరిందని తెలుస్తోంది. కరోనా రోగుల పేరిట తప్పుడు కేస్ షీట్లు తయారుచేయడం, ఎంజీఎంలో వైద్యం అందించేందుకు కేటాయించిన ఇంజెక్షన్ల లలో సగం బ్లాక్ మార్కెట్ కు తరలించడం వంటి అక్రమాలను ప్రోత్సహించిన అధికారులపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఎంజీఎం ఆస్పత్రి మాజీ సూపరిండెంట్ పై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే అతన్ని విధుల్లో నుంచి తొలగించారు.