హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కూడా బీభత్సంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా టెస్ట్ లు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా వెనుకబడే ఉంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంతో పోల్చి చూసున్నా సరే తెలంగాణ వెనుకబడే ఉంది. దేశ వ్యాప్తంగా సగటుతో పోల్చినా సరే తెలంగాణలో టెస్ట్ లు సరిగా జరగడం లేదు. చివరికి ప్రతిపక్షాలు, హైకోర్టు లు, తెలంగాణలోని మేధావులు అందరూ ఏంతో వత్తిడి తీసుకుని వస్తే అప్పుడు టెస్టులు చేశారు. రోజుకు మూడు, నాలుగు వేల టెస్టులు చేస్తే అందులో వెయ్యి అంటే 20 నుండి 25 శాతం పోజిటివిటి వస్తుంటే ఈ రెండు రోజుల నుండి నిన్న మొన్నా కూడా టెస్టులు ఆపేశారు. ఇది ఒక ఆందోళన కరమైన అంశం. దానికి తోడు కరోనా చాలా మందికి వస్తుంది. మొన్నేమో పోలీసు ట్రయినింగ్ సెంటర్ లోని పోలీస్ అకాడమీలో 180 మందికి వచ్చింది. అదొక పెద్ద ఆందోళనకరమైన అంశం. అలాగే టివి నటులు, సీరియస్ నటులకు వస్తుంది. హైదరాబాద్ లోని ప్రముఖులకు వస్తుంది. వారంతా బయటకు రావడానికి భయపడుతున్నారు. అంటే హైదరాబాద్ లో స్వేచ్ఛాయుత వాతావరణం పోయింది.
మొన్న తెలంగాణలో ఒక వ్యక్తి ఆక్సిజన్ అందటం లేదు, వెంటిలేటర్ లేదు అని చెప్పి చచ్చిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి అతను చనిపోయాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అది అబద్ధం, వీడియో నిజం కాదు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అనడం విమర్శలకు దారితీసింది. ఈటెల రాజేందర్ మీద దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ‘చనిపోబోయే అయిదు నిమిషాల ముందు ఏ వ్యకి అయినా అబద్దం చెబుతాడా? మీరు బుద్ది ఉండే మాట్లాడుతున్నారా’ అంటూ ఈటెల రాజేందర్ కు నెటిజన్ ల నుండి విమర్శలు వస్తున్నాయి. సో.. ఇది వాస్తవమే కదా. అతను చచ్చిపోతున్నాడు. ఆక్సిజన్ అందడం లేదు, వెంటిలేటర్ అందడం లేదు అని చెబుతూ అయిదు నిమిషాల్లో చనిపోయాడంటే ప్రపంచం కళ్ళు తెరవాల్సిన విషయం. కానీ తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గానీ కళ్ళు తెరవడం లేదు. ఇంకా ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చడం లేదు. ఇప్పటికి కూడా ఇక్కడ నిమ్స్, కొత్తగా ఏర్పాటు చేసిన టిమ్స్, అలాగే ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్, ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటే వీటన్నింటినీ ప్రక్కనపెట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే దాన్ని పైకి తీసుకొస్తున్నారు. దాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వపరమైన హాస్పిటల్ అన్ని వదిలేసి ఒక తెలంగాణ మంత్రికి చెందిన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ను పైకి తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక ఏమి జరుగుతోంది. కారణం ఏమి అయ్యుంటుంది. మీరే గెస్ చేయండి.