వికరాబాద్, మార్చి8: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు.
టిఆర్ఎస్, వైసిపి కలిపి 35 ఎంపీ స్థానాలు సాధించడం ఖాయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికే లోక్సభలో చెప్పారని పేర్కొంటూ ఇకముందు కూడా సహకరిస్తామన్నారు.
పోలవరం నిర్మాణానికి అడ్డుపడే లేదన్నారు . ‘చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతో తప్ప ఆంధ్ర ప్రజలతో మనకు ఎప్పుడూ పంచాయతీ లేదు’అని అంటూ ఆంధ్ర ప్రజలు మంచోళ్ళని కితాబు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ఘోరంగా పరాజయం పాలవుతుందని కెసిఆర్ అన్నారు.