(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా పరిశ్రమలో ఉత్పత్తైన కార్లు దేశంలోని అన్ని నగరాలకు సరఫరా అవుతున్నాయి. అందులో భాగంగానే కియా కార్లను ప్రత్యేక రైల్లో ఎక్కించి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి కియా ప్లాంట్ నుంచి వంద కార్లను తరలించారు. కియా ఫ్యాక్టరీకి సమీపంలోని పెనుగొండ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్పై నిలిపిన గూడ్స్ రైల్లోకి వంద కార్లను కియా సిబ్బంది ఎక్కించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ గ్రూప్ కంపెనీ కిమా మోటార్స్ భారత్లో తన తొలి మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏపీలోని అనంతపురం జిల్లాలో నెలకొల్పింది. కియా మోటార్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 600 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. సుమారు 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే కియా తన తొలి ఉత్పత్తి కియా సెల్టోస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సంస్థ మినీ సెడాన్, ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కార్లను ఉత్పత్తి చేయనుంది.
కరువు కోరల్లో చిక్కుకొన్న అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధిని కల్పించేందుకుగాను గత టీడీపీ ప్రభుత్వం కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌళిక వసతులతో పాటు రాయితీలను కూడా నాటి సీఎం చంద్రబాబు నాయుడు కల్పించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి కియా కార్ల ఫ్యాక్టరీని ఇటీవలే పరిశీలించారు.
గతంలో ఈ కారు లాంఛింగ్ ఈవెంట్కు ముఖ్యమంత్రి జగన్ వెళ్లకపోవడంతో.. టీడీపీ విమర్శలు కూడా గుప్పించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కియా పరిశ్రమను అనంతపురం తీసుకొచ్చారని.. ఆయనకు క్రెడిట్ దక్కుతుందని జగన్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై రాజకీయంగా దుమారం కూడా లేచింది. వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. కియా కార్ల ఫ్యాక్టరీపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సైతం అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది.