అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్ధానం కిడ్నీ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా పలాసలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పలాసలో 200 పడకల సామర్థ్యం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆసుపత్రికి అనుబంధంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లు పనిచేయనున్నాయి. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.