భారత ప్రముఖ క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్దగా పరిచయం లేని వ్యక్తి. మైదానంలో తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ అగ్ర కథానాయిక అయిన అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అనుష్క శర్మ కూడా బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా రాణిస్తోంది. అయితే ప్రస్తుతం విరుష్క దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం ఇదివరకే వెల్లడించారు. అయితే ఆదివారం సాయంత్రం కెప్టెన్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ద్వారా ఒక ఫోటోను షేర్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రికెట్ టోర్నీ కోసం యూఏఈ కి వెళ్ళిన విరాట్ కోహ్లీ తనతో పాటు అనుష్క శర్మ ను కూడా వెంట తీసుకెళ్లి అక్కడే నివసిస్తున్న సంగతి తెలిసినదే. అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటో కోహ్లీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తో తన అభిమానులు సూపర్ ఫోటో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఫోటోలో సాయంత్రం సంధ్యా సమయంలో అనుష్క శర్మ కోహ్లీ ఇద్దరూ నీటిలో ఒకరినొకరు చూసుకుంటుండగా వారి వెనుక ఓ అందమైన కోట లాంటి నిర్మాణం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ అందమైన మధుర జ్ఞాపకాన్ని తన సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ తీసినట్లు కోహ్లీ పేర్కొన్నా డు.
ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అటు కోహ్లీ అభిమానులు, ఇటు అనుష్క అభిమానులు ఈ ఫోటోకు ఫిదా అవుతున్నారు. ఇదివరకేతల్లిదండ్రులు కాబోతున్నామని వెల్లడించిన ఈ దంపతులు, ఆ ఆనంద క్షణాలను ఇతర సహచర ఆటగాళ్లతో ఒక వేడుకగా జరుపుకున్నారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని, ఈ సందర్భంగా ఆ దంపతులు తెలియజేశారు.