తెలుగు సినీ ప్రముఖులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సత్సంబంధాలున్నాయి. ఆయనకు వీలున్నప్పుడల్లా సినీ వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. నచ్చిన సినిమాలను చూస్తూ అప్రిషియేట్ చేస్తుంటారు. తాజాగా ఈయన ఒకేసారి రెండు సినిమాలను చూశారు. ఆ చిత్రాలే `సాహో`, `ఎవరు`. “సాహో` సినిమా టెక్నికల్గా చాలా బావుంది. తెలుగు సినిమా మార్కెట్ను పెంచిన సినిమా ఇది. ప్రభాస్, సుజిత్లకు అభినందనలు. అలాగే `ఎవరు` సినిమా ఆసక్తికరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో ఆకట్టుకుంది. అడివిశేష్, రెజీనా, నవీన్చంద్ర అద్భుతంగా నటించారు“ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
previous post
next post