తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వంద సీట్లతో టిడిపి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ స్పస్టం చేశారు. అసెంబ్లీ ఫలితాలపై తన సర్వే వివరాలను ఆదివారం తిరుపతిలో వెల్లడించారు.
టిడిపికి 100స్థానాలకు పది అటో ఇటో వస్తాయని తెలిపారు. వైసిపికి 72స్థానాలకు ఏడు అటో ఇటో వస్తాయని వస్తాయని చెప్పిన లగడపాటి జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు అటూ ఇటూ వస్తాయని చెప్పారు.
ఏపిలో ఓటర్లు సైకిల్, తెలంగాణలో ఓటర్లు కారు ఎంచుకున్నారని నిన్న ప్రకటించిన లగడపాటి నేడు అంకెలతో కూడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు.
ఈ సారి ఎన్నికల్లో ఏపిలో త్రిముఖపోరు జరిగినప్పటికీ టిడిపిదే విజయమని తేలిందనీ, వైసిపి గట్టిపోటీ ఇచ్చిందని లగడపాటి తెలిపారు.
కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఉంటుందని లగడపాటి అన్నారు.
టిడిపికి ఇంచుమించు 43శాతం, వైసిపికి 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనగా తెలిపారు.