గత 50ఏళ్లుగా దేశాన్ని దోచుకుంది గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులేనంటూ ఐపిఎల్ అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోది విమర్శించారు. ఇటీవల ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో దొంగలందరి పేరులో మోది ఎందుకు ఉంది అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది. దేశ వ్యాప్తంగా మోది ఇంటి పేరు కల్గిన వారు లక్షల సంఖ్యలో ఉంటారనీ, వారందరినీ అగౌరవపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ లలిత్ మోది అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు. రాహుల్ వాఖ్యలను ఖండిస్తూ..వీలుంటే బ్రిటన్ కోర్టును ఆశ్రయించి రాహుల్ గాంధీపై పరుపు నష్టం దావా వేస్తానని కూడా హెచ్చరించారు.
ప్రధాని మోది కూడా రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగతంగా తనను విమర్శించినా బాధపడననీ, తన కులాన్ని (బిసిలను) విమర్శిస్తే సహించేది లేదంటూ మోది వ్యాఖ్యానించారు.
బీహార్ డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోది కూడా రాహుల్ వ్యాఖ్యలు బాధించాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. సోమవారం కోర్టు ఈ అంశాన్ని విచారించనుంది.