రాంచీ: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో పాటు షుగర్, బీపీ సైతం నిలకడగా లేవని రాజేందర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు వెల్లడించారు. దాణా స్కాం కేసులో దోషిగా తేలిన లాలూ.. 2017 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కొంతకాలంగా రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం బ్లడ్ ఇన్పెక్షన్ లాలూ శరీరంలో వ్యాపించిందని, ఆయన కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని డాక్టర్ పీకే ఝా తెలిపారు. యాంటీబయోటిక్ మెడిసిన్లు కారణంగా కూడా ఆయన కిడ్నీ పనితీరు మందగించిందన్నారు.
previous post
next post