అవి చివరి శ్వాసలు…!
వాటికి తెలుసు కాసేపట్లో ఆగిపోతాయని…!
కానీ కలవాలి. తాకాలని,
ఆ బార్యభర్తల్ని కలిపి, ఒక్కటిగా శ్వాస వదిలేయాలని ధ్యాస…!
శ్వాసలు ఒక్కటయ్యాయి. ఆ దంపతులకు చివరి ముద్దు అందించాయి. రెండూ తమ కాలాన్ని విడిచాయి. ఆ దంపతులు కరోనాకి సేవ చేసి, కరోనాతో పోరాడి అక్కడే మరణించారు. ఇటలీలో జరిగిన ఆ సంఘటన వేలాది పేషేంట్లకు, లక్షలాది జనాలకు, యావత్తు లోకానికి నివ్వెర పోయేలా చేసింది…! అదేంటో ఒక్కసారి చూద్దాం, విందాం పదండి.
పిల్లల్ని వదిలి ఆసుపత్రికి…!
అది ఇటలీ. మిలాన్ నగరం. ఆసుపత్రి వేలాది కరోనా రోగులతో నిండి ఉంది. బెడ్లు ఖాళీ అవుతున్నా, మళ్ళీ వచ్చి చేరుతున్నారు. వైద్య సిబ్బంది ఇళ్లకు వెళ్లకుండా అక్కడే ఉండి విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్కడే ఆంటోనియా, సోఫియా అనే భార్యభర్తలు నర్సులుగా పని చేస్తున్నారు. ప్రేమ వివాహం. పెళ్లై తొమ్మిదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దర్నీ ఇంటిలో విడిచి, తమ తల్లికి పిల్లల బాధ్యతలు అప్పగించి విధుల్లోకి వచ్చేసారు. “ఎప్పుడు వస్తామో తెలియదు, జాగ్రత్తగా చూసుకోవాలంటూ కోరారు”. ఇంటి నుండి వచ్చి వారం గడిచింది. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాలనే తీరిక కూడా లేదు. రోజులో ఆరు గంటలే విశ్రాంతి. అది కూడా సహచరులు అందరూ ఉంటున్న గదిలోనే. ఎలాగోలా ఫోన్ చేసి, కొద్దీ సేపు మాట్లాడి పెట్టేసేవారు.
ఇద్దరికీ కరోనా… చికిత్స అందలేదు…!
రోగుల సేవలో ఉన్న ఆంటోనియాకి మార్చి 21 న కరోనా నిర్ధారణ జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మహమ్మారి వైద్య సిబ్బందిని వదలట్లేదు. చికిత్స తీసుకునే సమయం ఉండట్లేదు. వందలాదిగా కరోనా బాధితులు ఉన్న రూమ్ లోనే ఆంటోనియా బెడ్ లేక తనకు తానే చికిత్స చేసుకుంటున్నారు. తెలిసిన వైద్యమే కాబట్టి తగిన డ్రగ్స్ వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. అక్కడికి నాలుగు రోజుల్లోనే సోఫియాకి కరోనా సోకింది. వీరిద్దరితో పాటూ ఆ ఆసుపత్రి వైద్య సిబ్బందిలో 11 మందికి కరోనా సోకింది. ఈ ఇద్దరు బార్యభర్తలు చికిత్సకు, విశ్రాంతికి కనీసం బెడ్లు లేవు. ఇది వరకు ఉన్న విశ్రాంతి గదిలోకి కరోనా పాజిటివ్ పేషేంట్లకు అనుమతి ఉండదు. ఇక చేసేదేం లేక ఆ రోగుల గదికో తామూ రోగులుగా ఒక మూలన చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమిస్తుంది. కదల్లేని స్థితికి చేరుకున్నారు. సోఫియా పూర్తిగా నీరసించింది. ఆంటోనియా, సోఫియా ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటూ, విడిచి ఉండలేక… పిల్లల్ని గుర్తు చేసుకుంటూ మరణించారు. శ్వాసలు విడిచారు. ఆసుపత్రిలో మరణించగా… ఊరి బయట వారిని దహనం చేసేసారు. ఎముకల బూడిద కూడా ఇంటికి చేరణీయలేదు. పిల్లలకు చివరి చూపు అవకాశమూ ఇవ్వలేదు.
ఇటలీలో 6700 మంది వైద్య సిబ్బందికి…!
ఈ దంపతుల స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రపంచమంతా పాకింది. ఆ స్థితిని తలచుకుంటూ, ఆ పిల్లలని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తున్నారు. వీరే కాదు. ఇటలీలో ఇప్పటి వరకు 6700 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వారిలో 37 మంది మరణించారు. బెడ్లు లేవు, మందులు లేవు, విశ్రాంతి లేదు. మిగిలేది చివరి శ్వాస మాత్రమే. అది పిలిచినప్పుడు విడిచి వెళ్లిపోతున్నారు. ఇంత దీన స్థితిలో సాటి దేశం ఉంది. వైద్య సిబ్బంది ఉన్నారు. అన్ని వదిలి రోగులకు సేవలో ఉన్న వైద్య సిబ్బంది పరిస్థితులు ఇంత మానవీయంగా ఉన్నాయి.