(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో చివరి దశ అయిన ఏడవ నిడత పోలింగ్ ప్రారంభమయింది. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం సహా 59 లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది.
ఎనిమిది రాష్ట్రాలలో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. బీహార్లో 8, హిమాచల్ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, మధ్యప్రదేశ్లో 8 నియోజకవర్గాలతోపాటు చండీగఢ్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది.
ఈ 59 నియోజకవర్గాలలో క్రితంసారి ఎన్నికలలో 30 సీట్లు బిజెపి వశమయ్యాయి. ఆ రకంగా చూస్తే ఈ దశ పోలింగ్ ఆ పార్టీకి చాలా కీలకం. ఉత్తరప్రదేశ్లోని 13 సీట్లే కాక, పశ్చిమ బెంగాల్లోని తొమ్మిది సీట్లు కూడా బిజెపికి ప్రతిష్టాత్మకంగా మారాయి. సరైన ప్రతిపక్షం లేని బెంగాల్లో ఈ లోటును భర్తీ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బిజెపి అక్కడ తృణమూల్ కాంగ్రెస్తో గట్టిగా తారసిల్లడంతో నేటి పోలింగ్కు ముందు హింసాకాండ చోటుచేసుకున్నది.
ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ నియోజకవర్గమైన గోరఖ్పూర్ కూడా ఈ రోజు పోలింగ్కు వెళ్లింది. హిందీ సినిమా నటుడు సన్నీ దేవల్ పోటీ చేస్తున్న గురుదాస్పూర్లో, మరో ప్రఖ్యాత నటుడు శతృఘ్న సిన్హా పోటీ చేస్తున్న బీహార్లోని పాట్నా సాహిబ్లో కూడా ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.