సీనియర్ నటి గీతాంజలి(72) గుండెపోటుతో గురువారం ఉదయం కన్నుమూశారు. బుధవారం రాత్రి గుండెపోటుతో ఆమె బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1947 కాకినాడలో జన్మించారు గీతాంజలి. ఈమె అసలు పేరు మణి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. 1961లో తొలిసారిగా `సీతారామ కళ్యాణం` చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. బొబ్బిలి యుద్ధం, దేవత, లేతమనసులు,తోడు-నీడ, గుఢచారి-116 వంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. ఈమె నటించిన చివరి చిత్రం `దటీజ్ మహాలక్ష్మి`. అలనాటి హీరో, నటుడు రామకృష్ణను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.