అస్సాంకి చెందిన జాదవ్ పయెంగ్ చాలామందికి సుపరిచితమే. ఈయనకు ఇప్పుడు మరో అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని బిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్లో 6వ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్ గురించి బోధీస్తున్నారు. అస్సాం యొక్క పర్యావరణ కార్యకర్త జాదవ్ పయెంగ్ 128 వ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. “ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా” అని పిలువబడే ఆయనను మార్చి 11 న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ సత్కరించింది. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
మొక్కలు నాటడం రాబోయే తరాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడమే కాకుండ వాటిని సంరక్షించే బాధ్యత కూడ ఆయనే తీసుకోన్నాడు. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాడు. మొక్కలు పెంచాలనే భావన ప్రజల్లో కలిగేలా చైతన్యం తెచ్చాడు. మనిషి బతకడానికి ప్రాణవాయువు, మంచి ఆరోగ్యకర వాతావరణం ఉండాలి. కేవలం లక్ష్యంకోసం కాకుండా రేపటి తరం మంచి వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా భాగస్వామీ అయ్యాడు.
నాలుగు దశాబ్ధాల పాటు ఒంటి చేత్తో కొన్ని వేల మొక్కలను నాటి ఏకంగా 550 ఎకరాల అడవిని సృష్టించాడు. గ్రామస్తులు చెట్లను నరకబోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాడు. దీనిని గుర్తించిన భారతప్రభుత్వం ఆయనని పద్మశ్రీతో సత్కరించారు. ఇప్పుడు జాదవ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని బిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్లో౬వ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్ గురించి తెలియజేస్తున్నారు. దీని గురించి టీచర్ నవామీ శర్మ మాట్లాడుతూ, ఎకాలజీ పాఠాలలో భాగంగా జాదవ్ చేసిన పనులను వివరించారు. ఒక వ్యక్తి ఏవిధంగా సమాజం మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపగలడో భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో జాదవ్ గురించి పాఠ్యాంశాలలో చెబుతున్నామని నవామీ అన్నారు.
అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ మజులి అనే నదిముఖ ద్వీపంలోని బీడు భూమిలో 40 సంవత్సారాల నుంచి ఒక్కొక్క మొక్క నాటడం మొదలుపెట్టాడు. అలా ఆయన ఏకంగా 550ఎకరాలతో ఒక అడవినే తయారు చేశారు. ఆ అడవిలో ఏనుగులు, పులులు, జింకలు ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి. ఒక్కడిగా జాదవ్ మొదలు పెట్టిన పనివలన ప్రస్తుతం ఉంటున్న వారితో పాటు వచ్చే తరాల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే జాదవ్ గురించి అమెరికా పాఠ్య పుస్తకాలలో కూడా వివరిస్తున్నారు.